పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు ఇచ్చిన 56 హామీలనూ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈ ఉదయం నిరవధిక దీక్షను ప్రారంభించారు. గత నెల 25న రాజీనామా అల్టిమేటం పంపిన తనకు, దాదాపు నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదని, అందువల్లే తాను ఈ దీక్షను ప్రారంభిస్తున్నానని మాణిక్యాలరావు వెల్లడించారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకూ తన దీక్ష కొనసాగుతుందని చెప్పారు. ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చే ప్రయత్నం చేయలేదని ఆయన ఆరోపించారు.