ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరవధిక దీక్ష ప్రారంభించిన ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 21, 2019, 10:50 AM

పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు ఇచ్చిన 56 హామీలనూ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈ ఉదయం నిరవధిక దీక్షను ప్రారంభించారు. గత నెల 25న రాజీనామా అల్టిమేటం పంపిన తనకు, దాదాపు నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదని, అందువల్లే తాను ఈ దీక్షను ప్రారంభిస్తున్నానని మాణిక్యాలరావు వెల్లడించారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకూ తన దీక్ష కొనసాగుతుందని చెప్పారు. ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చే ప్రయత్నం చేయలేదని ఆయన ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com