శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్లో ముస్లింలపై వేధింపులు అధికమవుతున్నాయని, ముఖ్యంగా గుజ్జార్, బేకర్వాల్ కమ్యూనిటీలను వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. గవర్నర్ ఎస్పి మాలిక్ నేతృత్వంలోని పాలనలో గుజ్జార్లు, బేకర్వాల్ కమ్యూనిటీలకు చెందిన వారు వేధింపులకు గురవుతున్నారని, వారి సమస్యను గవర్నర్ పట్టించుకోకపోతే ‘ప్రమాదకర’ పరిణామాలు ఎదురవుతాయని ఆమె అన్నారు.