వరుసగా ఇంధన ధరలు దేశ వ్యాప్తంగా భగ్గుమంటుంన్నాయి. పెట్రోల్ ధర వరుసగా ఐదో రోజు పెరగగా.. డీజిల్ ధర వరుసగా 12 రోజు కూడా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం. సోమవారం ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 19 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.71.14కి చేరింది. ఇక లీటరు డీజిల్ ధర 26 పైసలు పెరిగి రూ.65.71లుగా ఉంది. ముంబయిలో పెట్రోలు ధర రూ.76.77.. డీజిల్ ధర రూ.68.81లుగా ఉంది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.75.47లుగా.. డీజిల్ ధర రూ.71.43 వద్ద కొనసాగుతోంది.