ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టు జడ్జీల నియామకంలో కేంద్రం, సుప్రీంల మధ్య వివాదం : జ‌స్టిస్ రాజేంద్రప్రసాద్

national |  Suryaa Desk  | Published : Mon, Jan 21, 2019, 12:36 AM

అల్ ఇండియా జడ్జి అసోసియేషన్ అన్ని రాష్ట్రాల్లో ఉన్న జడ్జీ ల సమస్యల  కోసం పనిచేస్తుందని ఆ అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కింది స్థాయి కోర్టు లు ఇచ్చిన తీర్పులు కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అవుతున్నాయన్నారు. ఆదివారం నగరంలో అల్ ఇండియా జడ్జి అసోసియేషన్ అధ్యక్షులు జస్టిస్ రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కింది కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా, అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు  కీలంగా మారింది. 1976 నుంచి ఇప్పటి వరకు  భారత జ్యుడీషియల్ వ్యవస్థ అలాగే ఉంది ఎలాంటి మార్పులు లేవన్నారు. హైకోర్టు జడ్జీ ల నియామకంలో కేంద్రప్రభుత్వం,  సుప్రీంకోర్టు మధ్య వివాదం కొనసాగుతుందన్నారు. తెలంగాణ న్యాయ శాఖ  అధికారులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.
జిల్లా కోర్టులలో కూడా ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలి. న్యాయ వవ్యవస్థ మార్పు కు జడ్జీ ల అసోసియేషన్ పని చేస్తుంది. మెట్రో లు విమానాశ్రయాలు అభివృద్ధి చెందినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదు, అంతిమంగా ప్రజలకు న్యాయం దక్కాలన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న న్యాయమూర్తులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తుల పై జరుగుతున్న ఏసీబీ సోదాలపై హైకోర్టు, సుప్రీంకోర్టు చూసుకుంటుందని, అందులో మేము జోక్యం చేసుకోలేమన్నారు. భవిష్యత్తు లో న్యాయమూర్తుల సమస్యల పై అల్ ఇండియా జడ్జీ ల అసోసియేషన్ పోరాడుతుందని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com