ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఆయుధాలను స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసుకోవాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. ఆయుధాలను దిగుమతి చేసుకునే బదులు మనమే ఎగుమతి చేసే స్థాయికి ఎదగాల్సిన అవసరముందన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని దసపల్ల హోటల్ లో ఫోరమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ, ఇండిజినెస్ డిఫెన్స్ ఇంటర్ ప్రెన్యూస్ అసోసియేషన్ ఆధ్వర్యం లో స్వదేశీ టెక్నాలజీ తో యుద్ధ పరికరాల తయారీ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆయుధాలను స్వదేశీ సంస్థలు తయారు చేయడానికి ముందుకు వస్తే వారికి కావాల్సిన సహకారాన్ని ఇండియన్ ఆర్మీ అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆయుధాలను దిగుమతి చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది... మనమే సొంతంగా తయారు చేసుకుంటే తక్కువ ఖర్చు అవుతుందన్నారు.