ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మటన్ బిర్యానీ' ప్రసాదం.. అదే ఆ టెంపుల్ స్పెషాలిటీ..

national |  Suryaa Desk  | Published : Sun, Jan 20, 2019, 08:45 PM

సాధారణంగా ఏ ఆలయంలోనైనా పులిహోరా, దద్దోజనం లేదా లడ్డూలు ప్రసాదంగా ఇవ్వడం అందరికీ తెలిసిందే. కానీ తమిళనాడులోని తిరుమంగళం తాలుకా వడక్కంపట్టి గ్రామంలో ఉన్న మునీశ్వరుడి ఆలయంలో మాత్రం ప్రసాదంగా ఏమిస్తారో తెలుసా?.. 'మటన్ బిర్యానీ'.. మీరు విన్నది నిజమే.. అక్కడ గత 83 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.ప్రతీ ఏటా జనవరి 25వ తేదీన ఇక్కడి మునీశ్వరుడి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా 2000కేజీల బాస్మతి రైస్‌, దానికి సరిపడా మటన్‌తో రుచికరమైన బిర్యానీ తయారుచేస్తారు. ఆరోజు ఆలయానికి వచ్చే భక్తులందరికీ ఇదే బిర్యానీని ప్రసాదంగా అందజేస్తారు.బిర్యానీని బ్రేక్‌ఫాస్ట్‌గా తినడమన్నది ఈ ఆలయానికి చెందిన ప్రత్యేకతగా మునీశ్వరన్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ బిర్యానీ ప్రసాదం అందిస్తామని చెప్పారు. వడక్కంపట్టిలో దాదాపుగా అందరూ ఈ బిర్యానీకి అభిమానులే అన్నారు.చిన్నా పెద్దా అంతా కలిసి ఆనందంగా ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com