ఎన్నికల షెడ్యూలు దాదాపు ఖరారు కావటంతో నవ్యాంధ్రలో అప్పుడే సార్వత్రిక ఎన్నిక వేడి మొదలైంది. రాజకీయ సర్వేలతో నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే నాయకుంతా ఎవరికివారు తమ తమ వ్యూహా రచనలో నిమగ్నమయ్యారు. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే నాటికల్లా విజయావకాశాలపై పార్టీ నేతలు తమ బలాబలాలను లెక్క వేసుకునే పనిలో ఉన్నారు. అధికార తెలుగుదేశం పార్టీతోపాటు ప్రతిపక్ష వైసీపీ, జనసేన నేతులుకూడా ప్రజల మనసుల్లో ఏముందో తొసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోగెలుపే క్ష్యంగా అందరూ పావు లు కదుపుతున్నారు. అయితే పార్టీపైనా, నాయకుపైనా ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది? వారు ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్నది ఫలితాలు వెలువడే వరకు తెలియదు. కానీ ప్రజల మదిలో ఏమున్నదో ముందుగా తొసుకునేందుకు సర్వేలు ఒక మార్గం. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెల మాత్రమే సమయం ఉండడంతో ఏ పార్టీపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ నాయకుడిని జనాలు విశ్వసిస్తున్నారన్నది ముందుగా తెసుకుని తమ లోటుపాట్లను సరి దిద్దుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు, నాయకులే సర్వేలకు దిగుతున్నారు. ఇదే సమయంలో పు ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజ ఆలోచనా విధానం ఏవిధంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో గొపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో తెసుకునేందుకు సర్వేలు చేపడుతున్నాయి. అందులోనూ ఈ సారి ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోరు ఖాయంగా కనిపిస్తుండడంతో ఈ సర్వేలకు మరింత ప్రాధాన్యత పెరిగింది.