ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్మీ యుద్ధ ట్యాంక్ అధిరోహించిన మోదీ

national |  Suryaa Desk  | Published : Sat, Jan 19, 2019, 09:53 PM

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో యుద్ధ సైనికుడిగా మారారు. ఆర్మీ యుద్ధ ట్యాంక్ ఎక్కి తన ముచ్చట తీర్చుకున్నారు. దానిపై కొంత దూరం వెళ్లారు. సూరత్‌లోని హజిరా ప్రాంతంలో ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన ఆర్మ్‌డ్ సిస్టమ్స్ కాంప్లెక్‌లో హోవిట్జర్ గన్ తయారీ యూనిట్‌ను అంతకుముందు మోదీ ప్రారంభించారు. ఇక్కడ ఎల్ అండ్ టీ కంపెనీ కే9 వజ్ర ట్యాంకర్లను తయారు చేస్తోంది. 100 ట్యాంకర్లు తయారు చేసేందుకు రూ.4500 కోట్ల కాంట్రాక్టును ఈ కంపెనీ 2017లో పొందింది. దేశంలోని హొవిట్జర్ గన్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. 'మేక్ ఇన్ ఇండియా' ఇనీషియేటివ్‌లో భాగంగా ఆర్మీకి వీటిని అందించబోతున్నారు.కే-9 వజ్రా సెల్ప్ ప్రొపెల్డ్ హొవిట్జర్‌ నిర్మాణానికి సంబంధించి లార్సెన్ అండ్ టుబ్రోకు తన అభినందలు తెలుపుతున్నానని, భారతదేశ రక్షణరంగం, దేశ పరిరక్షణకు సంబంధించి ఇది గొప్ప ముందడుగు అని  ప్రధాని మోదీ అంతకుముందు ఓ ట్వీట్‌లో ప్రశంసించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com