సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై విచారణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరపాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ పూర్తిగా కక్ష పూరితంగా అలోక్ వర్మను బదలీ చేశారని ఆయన ఆరోపించారు. కేరళలో పినరయ్ విజయన్ సర్కార్ పై మోడీ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. సుప్రీం తీర్పును ధిక్కరించే విధంగా ప్రధాని మోడీ మాట్లాడటం దారుణమని విమర్శించారు.