విజయవాడ : తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు అన్నారు. జగన్పై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక పుస్తకంలో రాశానని శ్రీనివాస్ ఎన్ఐఎ కోర్టులో చెప్పారు. ఆ పుస్తకాన్ని జైలు అధికారులు లాక్కున్నారని అతడు చెప్పాడు. ఆ పుస్తకాన్ని తనకు ఇప్పించాలని ఎన్ఐఎ కోర్టును కోరాడు. ప్రజలతో మాటల్డే అవకాశం ఇస్తే అన్నీ చెబుతానని శ్రీనివాస్ అన్నారు. ఎన్ఐఎ నిబంధనలు ఉల్లంఘించిందని శ్రీనివాస్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. తమకు తెలియకుండా శ్రీనివాసరావును 30 గంటలపాటు ఎన్ఐఎ అధికారులు విచారించారని న్యాయవాది చెప్పారు.