ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 18, 2019, 10:38 AM

దేశ రాజధాని నగరాన్ని పొగమంచు కప్పేసింది. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా పరిసర ప్రాంతాలు అగుపించకుండా ఉన్నాయి. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరే విమానాల షెడ్యూల్‌ను అధికారులు పొడిగించారు. ఢిల్లీకి చేరుకునే విమానాలకు వాతావరణ పరిస్థితుల్ల వల్ల ఆలస్యంగా చేరుకుంటున్నాయి. అదేవిధంగా రైలు సర్వీసులు కూడా ఆలస్యం అవుతున్నాయి. 10 రైళ్ల వేళ్లల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలతో కూడిన జాగ్రత్తలను విడుదల చేశారు. తక్కువ వేగంతో, హెడ్ లైట్స్‌ను ఆన్‌లో ఉంచి డ్రైవ్ చేయాల్సిందిగా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అసోం, మేఘాలయ, త్రిపుర రాష్ర్టాల్లో సైతం దట్టమైన పొగమంచు కురుస్తుంది. ఇదే విధమైన పరిస్థితి మరో రెండు రోజులపాటు కొనసాగుతున్న వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com