తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు తిరుమల కొండపైకి చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్లు బయటకు వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతుండగా..శ్రీవారి టైంస్లాట్ సర్వదర్శనం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,124 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,236 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమలేశుని హుండీకి సమకూరిన ఆదాయం రూ.2.73 కోట్లు.