కడప: శుక్రవారం జిల్లాలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ పర్యటించనున్నారు. రాజ్నాథ్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.50 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు నగరంలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న కందుల మైదానానికి చేరుకుంటారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖ్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.అక్కడి నుంచి 4.55 గంటలకు కడప విమానాశ్రయం వెళ్లి, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.