ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిపోవడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 11:33 PM

ఎన్నికల్లో వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా, ప్రజలు విజ్ఞతతలో ఓట్లేశారు. ఓటింగ్‌ శాతం భారీగా నమోదవడం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయానికి సంకేతం. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం తథ్యం.’’ అని టీడీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ..... పోరంకి, తాడిగడప, సాలిపేట, పెనమలూరులో ఓటింగ్‌ సరళి టీడీపీకి అనుకూలంగా ఉండడం చూసి జోగి రమేశ్‌, ఆయనతో పాటు వచ్చిన గూండాలు రెచ్చిపోయారన్నారు. ఓటింగ్‌ ప్రక్రియను ఆపాలని ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. కౌటింగ్‌ రోజున ఫలితాలను చూసి, ఇతర రాష్ర్టాలకు తరిలిపోదామన్న ఆలోచనలో వైసీపీ ముఖ్య నాయకులు ఉన్నారని ఎద్దేవా చూశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వమొచ్చాక చంద్రబాబు అమలు చేస్తారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com