ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో జవాన్ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 11:28 PM

ఆమదాలవలస పరిధిలోని  కొర్లకోట గ్రామానికి చెందిన సీఆర్‌ పీఎఫ్‌ జవాన్‌ పేడాడ రాజగోపాలరావు (29) అనారోగ్యానికి (వైరల్‌ ఫీవర్‌) గురై మృతి చెందారు. హైదరా బాదు సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌లో రాజగోపాలరావు విధులు నిర్వహిస్తున్నారు. అక్కడే అనారోగ్యానికి గురై గురు వారం కన్నుమూశారు. ఆయన స్వగ్రామమైన కొర్లకోట గ్రామానికి శుక్రవారం సీఆర్‌పీఎఫ్‌ అధికారులు ప్రత్యేక వాహనంలో పార్థివదేహాన్ని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ కె.వెంకటేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు జవాన్‌ మృతదేహానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల ఖర్చులు నిమిత్తం రూ.50 వేలు అతడి భార్య చాందినికి పోలీసులు అందించారు. భార్యతో పాటు ఆయనకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఎంపీటీసీ అన్నెపు భాస్కరరావు, సనపల అప్పలనాయుడు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com