ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన 12లోపు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 11:24 PM

పాఠశాలలు పునఃప్రారంభంలోపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు విద్యాకానుక, పాఠ్యపుస్తకాలను చేర్చాలని ఎస్టీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు అంకం శివారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఎస్టీయూ నేతలతో కలిసి అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి శివప్రకాశరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....  జూన 12వ తేదీలోపు అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, విద్యాకానుకలను చేర్చాలన్నారు. ఎస్‌ఎస్‌సీ స్పాట్‌లో పాల్గొన్న ఇంగ్లీషు, ఫిజిక్స్‌, బయాలజీ, మ్యాథ్స్‌ టీచర్లకు పారితోషికం ఇచ్చినా, ఇంకా టీఏ, డీఏలను చెల్లించలేదన్నారు. గత, ప్రస్తుత వేసవి సెలవుల్లో నాడు- నేడు ఫేజ్‌-2 కింద పాఠశాలల్లో పనులు చేయిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు, సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని డీఆర్‌వోకు ఇచ్చిన వినతిపత్రంంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర నాయకులు వై. రవీంద్రనాఽథ్‌రెడ్డి, జిల్లా మైనార్టీ కన్వీనర్‌ ఎస్‌ఏ మున్వర్‌బాషా, జిల్లా నాయకులు వాసుదేవరెడ్డి, శంకర్‌రెడ్డి, ప్రదీప్‌, నాగరాజు, జగదీశ, గోపీక్రృష్ణ, భాస్కర్‌రెడ్డి, సునీర్‌, మధుసూదనరెడ్డి, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com