గాంధీనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటన కోసం గుజరాత్ కు వచ్చారు. రేపు తొమ్మిదో వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభిస్తారు. ఇది 18 నుంచి 20 వ తేదీ వరకు జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఈ రోజు వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో ప్రారంభించారు. మూడు రోజుల గ్లోబల్ సమ్మిట్ లో అయిదు దేశాల అధినేతలు, ముప్పై వేలమంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు,దేశ విదేశాలకు చెందిన పెద్ద కంపెనీల కార్య నిర్వహణాధికారులు తదితరులు పాల్గొంటారు.