ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గ గుడిలో కొత్త నిబంధనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 17, 2019, 04:06 PM

విజయవాడ : విజయవాడ కనక దుర్గమ్మ కొండపై ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ఆలయం ఆవరణలో తెలంగాణ నేత తలసాని రాజకీయ ప్రకటన చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికంగానే ఉండాలంటూ కొత్త నిబంధనలు విధించింది. ఆలయం పరిసరాల్లో రాజకీయాలు మాట్లాడకూడదని, ఎటువంటి ప్రెస్‌మీట్‌లకు అనుమతి లేదని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. వ్యాపారపరమైన పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడితే చర్యలు తీసుకుంటామని దేవస్థానం అధికారులు హెచ్చరించారు. ఇటీవల దుర్గమ్మ దర్శనానికి వచ్చి కొండపై రాజకీయాలు మాట్లాడిన తెలంగాణ నేత తలసాని శ్రీనివాస యాదవ్ ఇంద్రకీలాద్రి ఆవరణలో రాజకీయ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com