ఒడిశాలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీరాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషోర్ దాస్ పార్టీ అధ్యక్షపదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవని ఆ లేఖలో స్పష్టం చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ బీజేడీలో చేరుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కిషోర్ దాస్ ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.