చందర్లపాడు : కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కాసరాబాదు వద్ద 12 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తుతున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా కలెక్టరు లక్షీకాంతం ఉత్తర్వుల మేరకు నందిగామ తహశీల్దార్ రామకృష్ణ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను ఆదేశించారు.