అమరావతి: ఏపీలో టీడీపీని అణగదొక్కేందుకు టీఆర్ఎస్, వైసీపీ పన్నాగం పన్నాయని తెలుగుదేశం అధికార ప్రతినిధి అనురాధ విమర్శించారు. ఈరోజిక్కడ ఆమె మాట్లాడుతూ కేసీఆర్, జగన్ ఏపీకి తాచుపాముల్లా తయారయ్యారని పేర్కొన్నారు. బీసీలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు. 26 కులాలను బీసీ జాబితా నుంచి కేసీఆర్ తీసేశారని పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం చేస్తుంటే… కేసీఆర్ను అడిగే ధైర్యం తలసానికి ఉందా? అని ఆమె ప్రశ్నించారు.