నాలెడ్జ్ ఎకానమీకి అమరావతి కేంద్రం కావాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ భూమిపూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఎక్స్ఎల్ఆర్ఐ అన్నారు. అమరావతిలో సంస్థ ఏర్పాటు కావడం అదృష్టమన్నారు. నాలెడ్జ్ ఎకానమీ రావాలనే ఏపీకి ఆహ్వానించామన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రం కావాలని కోరుకుంటున్నానన్నారు. కొన్ని దేశాలు తమ పెట్టుబడులను నాలెడ్జ్ ఎకానమీపై పెట్టాయి. ఏపీలో తెలంగాణ ఎమ్మెల్యే తలసాని వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవ మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ ఓ మాయ లేడి లాంటిదన్నారు. టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనలో టీడీపీ నేతలు పాల్గొనవద్దని సీఎం చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు.