గత ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చని ఇంధన ధరలు బుధవారం కొంత తగ్గాయి. ఇక తగ్గుముఖం పడుతాయనుకున్న సమయంలో గురువారం ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ఈ నెలలో పెట్రోల్ ధర 8 సార్లు, డీజిల్ ధర 9 సార్లు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలుపై 14 పైసలు, లీటరు డీజిల్ పై 19 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.70.47, డీజిల్ ధర రూ.64.78లుగా ఉన్నాయి.ముంబయిలో 14 పైసలు పెరిగి పెట్రోలు ధర రూ.76.11లుగా ఉంది. 20 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.67.82 లుగా ఉంది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.74.76, డీజిల్ ధర రూ.70.42 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా.. దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతూ రావడం విశేషం.