ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంభమేళా లో మొట్టమొదటిసారిగా.. పుణ్యస్నానాలు ఆచరించిన ‘హిజ్రా’ అఖాడా సభ్యులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 17, 2019, 11:31 AM

చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన ‘హిజ్రా’  బృందానికి అఖాడా గుర్తింపు దక్కింది. ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో హిజ్రాలకు చెందిన ‘కిన్నర్ అఖాడా’ బృందం పుణ్యస్నానాలు ఆచరించింది. ఈ సందర్భంగా కిన్నర్ అఖాడాకు చెందిన ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ కుంభమేళా చరిత్రలోనే ఇది మొట్టమొదటి ఘటన అని, ఈ ఘటన ద్వారా మేము కూడా ఈ సమాజంలో భాగమే అన్న బలమైన సందేశం అందరికి చేరుతుందని అన్నారు. తమ బృందాన్ని ‘లైంగిక పరిధులను అధిగమించిన అఖాడా’గా వ్యవహరిస్తున్నామని తెలిపారు. అఖాడాకు చెందిన ప్రధాన అర్చకురాలు ఆచార్య లక్ష్మీనారాయణ త్రిపాఠి ఈ సందర్భంగా మీడియాతో ఈ కుంభమేళాకు రావడం అనేది ఆధ్యాత్మిక దివ్యానుభూతినిచ్చిందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com