ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ.. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై కసరత్తు ప్రారంభించింది. పార్టీ కమిటీల నియామకాన్ని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీని అధిష్టానం నియమించింది. ఈ కమిటీకి ఛైర్పర్సన్గా పురంధేశ్వరిని ఎంపిక చేశారు. కన్వీనర్గా ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును నియమించారు. వీరిద్దరితోపాటు మరో 9 మందిని సభ్యులుగా నియమించారు.
బీజేపీ మేనిఫెస్టో కమిటీలోని సభ్యులు..
1. డి. పురందేశ్వరి(చైర్పర్సన్)
2. ఐవైఆర్ కృష్ణారావు(కన్వీనర్)
3. పి. విజయ బాబు
4. పీవీఎన్ మాధవ్
5. దాసరి శ్రీనివాసులు
6. షేక్ మస్తాన్
7. పాక సత్యనారాయణ
8. కె. కపిలేశ్వరయ్య
9. పి సన్యాసి రాజు
10. సుదీష్ రాంబోట్ల
11.డీఏఆర్ సుబ్రహ్మణ్యం