ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి వేడుకలు వినూత్నంగా జరి గాయి.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 17, 2019, 08:37 AM

తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలు కోట్లలో సాగితే.. తమిళనాడులో కనుమ సందర్భంగా జల్లికట్టు, కర్నా టకలో ఆవులతో మంటలు దాటడం వంటి పోటీలు నిర్వహించారు. ఎద్దు లతో ఆడే జల్లికట్టు ఆట అత్యంత ప్రమాదకమని తెలిసినా.. ప్రతి ఏడాది ఔత్సాహికుల పోటీ పెరుగుతూనే ఉంది. తమిళనాడులోని మధురై జిల్లా అవనియపురంలో నిర్వహించిన జల్లికట్టు క్రీడలో 900 ఎద్దులు రంకెలు వేస్తూ.. మైదానంలో దూసుకెళ్తుండగా వాటిని అదుపు చేసేందుకు 800 మంది మైదానంలో పోటీ పడ్డారుపరుగెడుతూ వస్తున్న ఎద్దులను అదుపుచేసేందుకు యువకులు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో క్రీడను చూసేందుకు వచ్చిన జనంపైకి ఎద్దులు దూసుకెళ్లాయి. దీంతో 48 మంది గాయపడ్డారు.వీరిలో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.


జల్లికట్టును మధురై జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ ప్రారంభించగా… మొత్తం 8 రౌండ్లలో ఆట సాగింది. ఒక్కోరౌండ్‌లో 50 కి పైగా మైదానంలో దూసుకొచ్చే ఎద్దులతో 75 నుంచి 100 మంది పోటీ పడ్డారు. వాటిని అదుపు చేసేందుకు మూపురం పట్టుకుని కలెబడ్డారు.ఒక్కో రౌండ్‌లో విజయవంతంగా ఎద్దులను అదుపుచేసిన వారు మరో రౌండ్‌లో ప్రవేశిస్తూ పోటీ పడ్డారు.చూస్తేనే ఒళ్లు గగుర్లు పొడిచే ఈ క్రీడపై 2015లో సుప్రీంకోర్టు నిషేధం విధించగా..స్థానికులు చెన్నైలోని మెరినా బీచ్‌లో ఆందోళనలకు దిగారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలతో 2016లో నిషేధం ఎత్తివేసింది.దేశవ్యాప్తంగా గో రక్షణ నినాదం మారుమోగుతున్న తురణంలో కర్నాటకలో మాత్రం గోవులను క్రీడలో పేరుతో హింసిస్తున్నారు. 


సంక్రాంతి సందర్భంగా ఆవులను అందంగా అలంకరించి మంటల నుంచి దాటిస్తారు. ఆవులతో పాటు వాటి యాజమానులు కూడా మంటలు దాడటం గమనార్హం. పంటల పండుగగా పేర్కొనే ఈ క్రీడ అనాదిగా నిర్వహిస్తున్నామని మైసూరు, మాండ్య ప్రజలు చెబుతున్నారు. పంటలు పండించేందుకు ఎంతో ఉపయోగపడే గోవులు ధైర్యంగా ఉండాలని సంకల్పంతో ఈ క్రీడను నిర్వహిస్తారని చెబుతున్నారు. గోవులతో పాటు తాము కూడా మంటలు దాట ుతామని పేర్కొంటున్నారు. పంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతోనే మంటలు దాటుతారన్నది స్థానికుల వాదన. అయితే బుధవారం నిర్వహించిన ఈ క్రీడలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఆట అని తెలిసినా.. తమ పూర్వికుల సంప్రదాయాలను కొనసాగించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com