అమరావతి: కోస్తా ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. జాతీయరహదారిపై వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్లపై నెమ్మదిగా రాకపోకలు జరుగుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తగు చర్యలు చేపట్టారు.