తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. కాగా... స్వామివారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది.అలాగే టైంస్లాట్, నడక దారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 3గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.