ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..ఈ రైళ్లకు అదనంగా బోగీలు ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 09:09 PM

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. వేసవి కావడంతో రద్దీ పెరిగింది.. దీంతో పలు రైళ్లకు అదనపు కోచ్‌లను అనుసంధానం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 17 నుంచి 20 వరకు తిరుపతి నుంచి లింగంపల్లి వెళ్లే రైలుకు మూడు థర్డ్ ఏసీ కోచ్‌లు, ఒక ఎకానమి ఏసీ కోచ్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ నెల 20న సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే రైళ్లకు ఒక స్లీపర్‌ కోచ్‌ను అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 18 నుంచి 21 వరకు లింగంపల్లి- ముంబై.. అలాగే ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు ముంబై - లింగంపల్లి రైలుకు మూడు థర్డ్ ఏసీ కోచ్‌లు, ఒక ఎకానమి ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


ఈ నెల 17 నుంచి సికింద్రాబాద్‌ నుంచి తిరువనంతపురం.. అలాగే ఈ నెల 19 నుంచి తిరువనంతపురం - సికింద్రాబాద్‌ రైలుకు ఒక థర్డ్ ఏసీ కోచ్ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 18, 20 తేదీల్లో సికింద్రాబాద్‌- విశాఖపట్నం రైలు.. ఈ నెల 19, 21 వతేదీలలో విశాఖపట్నం-సికింద్రాబాద్‌ రైళ్లకు థర్డ్ ఏసీ ఒక కోచ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 19 వరకు మచిలీపట్నం-బీదర్‌ రైలు.. ఈ నెల 17నుంచి 20 వతేదీ వరకు బీదర్‌-మచిలీపట్నం రైలుకు థర్డ్‌ ఏసీ ఒక కోచ్‌, ఒక స్లీపర్‌ కోచ్‌‌ను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 18 వరకు కాచిగూడ- రేపల్లె రైలుకు, 18 నుంచి 20 వరకు రేపల్లె -వికారాబాద్‌ రైలుకు ఒక స్లీపర్ కోచ్ అనుసందానం చేస్తారు.


ఈ నెల 17 నుంచి 19 వరకు రేపల్లె- సికింద్రాబాద్‌ రైలు, ఈ నెల 18 నుంచి 20 వరకు సికింద్రాబాద్‌- రేపల్లె రైలు, ఈ నెల 17 నుంచి 19 వరకు సికింద్రాబాద్‌- భద్రాచలం రోడ్డు రైలు.. ఇటు ఈనెల 18 నుంచి 20 వరకు భద్రాచలంరోడ్డు- సికింద్రాబాద్‌ రైలుకు ఒక స్లీపర్‌కోచ్‌ను అదనంగా ఏర్పాటు చేస్తారు. ఈ నెల 20 వరకు గుంటూరు-వికారాబాద్‌ రైలుకు ఒక స్లీపర్‌ కోచ్‌ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 16 నుంచి 20 వరకు నర్సాపూర్‌- ధర్మవరం రైలు.. ఈ నెల 17 నుంచి 21 వరకు ధర్మవరం-నర్సాపురం రైలుకు ఒక స్లీపర్‌ కోచ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 20 వరకు నర్సాపురం-హుబ్లీ రైలు.. ఈ నెల 17 నుంచి 21 వరకు హుబ్లీ- నర్సాపరం‌ రైలుకు అదనంగా థర్డ్‌ ఏసీ ఒక కోచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com