ఏపీఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గా నలమారు చంద్రశేఖర రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లాలోని పుల్లంపేట మండలం కేతరాజు పురం చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం. ఏపీపీఎస్సీ గ్రూపు-2 పరీక్షలో నెగ్గి 1985 లో జైళ్ల శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధుల్లో చేశారు. 1986 లో ఏపీఎన్జీఓ సంఘంలో ప్రస్థానం ప్రారంభించిన చంద్రశేఖర రెడ్డి 1989 లో హైదరాబాద్ యూనిట్ జాయింట్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా బండి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.