ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న సమయంలో పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా పవన్ రోడ్ షో నిర్వహించగా.. జనం నీరాజనం పలికారు. దారిపొడువునా పవన్ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. స్థానిక టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మతో కలిసి పవన్ కళ్యా్ణ్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ఓ అభిమాని పవన్ కళ్యాణ్కు అరుదైన కానుక అందించారు. పవన్ కళ్యాణ్ తన తల్లితో కలిసి ఉన్న పెయింటింగ్ బహుమతిగా అందించారు.