గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన తల్లి కొణిదెల సురేఖ రేపు పిఠాపురం వస్తున్నారు. రామ్ చరణ్ శనివారం ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోని, అక్కడి నుంచి సురేఖ పిఠాపురం వెళ్లనున్నారు. ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో వారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసే అవకాశం ఉంది.