కొండేపి పొగాకు వేలం కేంద్రంలో గురువారం నిర్వహించిన వేలంలో పొగాకు అత్యధిక ధర రూ. 299 పలికిందని వేలం నిర్వహణాధికారి జి సునీల్ కుమార్ తెలిపారు. పొగాకు వేలం కేంద్రం పరిధిలోని అనకర్లపూడి, పెరదేపి, మిట్టపాలెం గ్రామాల నుంచి రైతులు 988 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 88 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. గరిష్ఠ ధర కేజీ రూ. 299, కనిష్ఠ ధర రూ. 205, సరాసరి ధర రూ. 266. 07లు పలికిందన్నారు.