సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని కొండేపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం కొండేపి మండలం కే ఉప్పలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని గుర్తు చేశారు. మే 13న జరిగే పోలింగ్ టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.