ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని పాములపాడు, కాశీపురం, కాటూరివారిపాలెం గ్రామాలలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించాలని, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక అభ్యర్థులను కోరారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.