గంగవరం మండలంలోని బండ మీదవారిపల్లికి చెందిన పలువురు గురువారం వైసీపీ నుండి టిడిపి, జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీమంత్రి ధిమా వ్యక్తం చేశారు. అనంతరం టిడిపి అధికారంలోకి రాగానే చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.