టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ గురువారం శ్రీకాకుళం, గార మండలాలలో రోడ్ షో నిర్వహించారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను పర్యటించేలా రోడ్డు షో చేపట్టారు. రోడ్డుషో యువత, కార్మిక, కర్షక వర్గాలు వెంట తరలి వచ్చారు. కొత్తూరు, సవిరిగాం, సతివాడ, నిజామాబాద్, తూలుగు, ఆమదాలపాడు, పెద వత్సవలస, పేర్లవాని పేట, మొగదాల పాడు, కొమరవాని పేట, కొర్ని మీదుగా గార మండల కేంద్రం వరకు సాగింది.