సీఎం జగన్పై ఏపీసీసీ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన హంతకులను సీఎం కాపాడుతున్నారని ఆరోపించారు. "వైసీపీ వాళ్లు హత్యలు చేయడానికే అధికారాన్ని వాడుకుంటున్నారు. అవినాష్ నిందితుడని సీబీఐ ఆరోపించింది. జగన్కు అధికారమిచ్చింది అవినాష్ను కాపాడడానికేనా? ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా. కానీ ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా." అని షర్మిల పేర్కొన్నారు.