సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు ఇప్పుడు నిధులు విడుదలపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలింగ్కు రెండు రోజుల ముందు నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగగా.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం తరపున వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. అంతకముందు ఎన్నికల కమిషన్ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాలు ఇచ్చి, మళ్లీ విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన ఈసీ ఈరోజు కోర్టు ముందు సమాధానం ఇచ్చింది.