రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీలలో కీలకనేతలు చేరడం జరుగుతుంది. పాలక పక్షం, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన సీపీఐ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు రసూల్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం కర్నూలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రసూల్ వైయస్ఆర్సీపీలో చేరారు.