అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు పార్టీ వీడారు. గురువారం రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వారికి వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పెద్దపోతులయ్య, పెద్ద నాగేష్, చిన్న నాగేష్, ఆదెప్ప, నాగప్ప, మారుతి, శేషు, నాగార్జున, తదితరులు ఉన్నారు.