నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం కొండ బిట్రగుంట రైల్వే ట్రాక్ పై రైలు ఢీకొనడంతో రెండు జింకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అంతరించిపోతున్న దేశ సంపధను కాపాడాలన్నారు.