ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో నంద్యాలలో చండీ యాగం, సుదర్శన హోమాన్ని గురువారం నిర్వహించినట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటరామరాజు, సంయుక్త కార్యదర్శి నాగరాజారావు మీడియాకు తెలిపారు. లోక కళ్యాణం కోసం నిర్వహించిన హోమంలో బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి నగరడోన సుధీర్, ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి దంపతులు పాల్గొన్నారు.