ధర్మవరంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గురువారం పాదయాత్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. ఎన్డీఏ అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ గెలుపు కోసం పాదయాత్ర ప్రారంభించామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా భూకబ్జాలతో ప్రజలు విసిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి సత్యకుమార్ యాదవను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.