ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 09:00 PM

ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ చేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలను ఈసీ బదిలీ చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితమే అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేయగా.. ఆ మరుసటి రోజే ఈ ఉత్తర్వులు రావడం విశేషం. ఆ వెంటనే డీఎస్పీ, ఎస్సైను బదిలీ చేశారు. ఈ స్థానాల్లో వేరే అధికారుల్ని నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రతిపక్షాలు డీఎస్పీ, ఎస్సైలపై వరుసగా ఫిర్యాదులు అందాయి.. దీంతో బదిలీ వేటు పడింది.


గత నెల 29న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరు సదుం మండలం యర్రాతివారిపల్లెలో బీసీవై పార్టీ అధినేత, పుంగనూరు అభ్యర్థి రామచంద్ర యాదవ్‌ ప్రచారం కోసం వెళ్లారు. అక్కడ రామచంద్రయాదవ్‌తో పాటూ అనుచరులపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ గొడవపై ఫిర్యాదు చేసేందుకు సదుం పోలీసు స్టేషన్‌కు వెళ్లగా.. అక్కడా తమపై దౌర్జన్యం చేశారని రాచమంద్ర యాదవ్ ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.. పీఎస్ దగ్గర దగ్గర బీసీవైపీ ప్రచార రథానికి నిప్పుపెట్టే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత రామచంద్ర యాదవ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.. ఈ క్రమంలో ముందుగా డీఐజీ అమ్మిరెడ్డిపై బదిలీ వేటు పడింది. తాజాగా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. గతంలో కూడా పలమనేరు డీఎస్పీ, ఎస్సై మారుతిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని విధుల నుంచి తప్పించింది ఎన్నికల సంఘం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com