ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 08:52 PM

ఏపీలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తేదీ అంటే వచ్చే సోమవారమే ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు వచ్చాయి. రమేష్ బులగాకుల అనే వ్యక్తి ఎక్స్ ఖాతా నుంచి గద్దె రామ్మోహన్ రావు గురించి సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్ వదిలారు. నా పేరు వాసు అంటూ తన గురించి రాసుకొచ్చిన సదరు వ్యక్తి.. రామ్మోహన్ మీద సంచలన ఆరోపణలు చేశారు.


గత 15 ఏళ్లుగా తనతో అడ్డమైన పనులు చేయించుకున్నారని.. మూడో కంటికి తెలియకుండా ఆయన అవసరాలు అన్నీ తీర్చానని చెప్పుకొచ్చారు. " మీరు చేసింది చాలా తప్పు సార్, నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నానో మికు తెలుసు, కానీ మీరు నన్ను ఇంత నీచంగా అవమానకరంగా మాట్లాడతారు అని అనుకోలేదు. ప్రతి మనిషి ఎంత నీచమైన పనులు చేసిన వాడికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం పోతే ఎవరిని లెక్క చేయడు. మీకు 15 ఏళ్లు సేవలు చేసి మీ అవసరాలు అన్నీ తీర్చిన నన్ను, ఇంత దారుణంగా మోసం చేస్తావు అనుకోలేదు.. నువ్వు నాకు చేసిన అన్యాయానికి నువ్వు ఈ రోజు నుంచి అనుభవిస్తావు" అంటూ రాసుకొచ్చారు.


ఇన్నాళ్లూ తనకు మాత్రమే తెలిసిన గద్దె రామ్మోహన్ రావు నిజస్వరూపాన్ని బయటపెడతానంటూ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్నాళ్లుగా నీకు నాకు మాత్రమే తెలిసిన నీ నిజస్వరూపాన్ని ఈ రోజు ప్రజల ముందు ఉంచబోతున్నా. నీ నీచమైన చీకటి బతుకును ప్రజలకు వివరించాలని, నీలాంటి మేకవన్నె తోడేలును ప్రజలు నమ్మకూడదని తీవ్ర ఆరోపణలు చేశారు. నీ మాటలకు ఇంకో అమ్మాయి మోసపోకూడదనే ఇవన్నీ బయటపెడుతున్నానంటూ గద్దె రామ్మోహన్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. నీ కామవాంఛకు ఎంతమంది జీవితాలు బలయ్యాయో నీకు, నాకూ తెలుసంటూ రాసుకొచ్చారు. ఇక కొన్ని ఫోన్ నంబర్లను, వాట్సాప్ ఛాటింగ్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేసిన యూజర్... గద్దె రామ్మోహన్ రావు గురించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడీ పోస్టు హ్యాష్ ట్యాగ్ గద్దె లీక్స్ పేరుతో వైరల్ అవుతోంది.


అయితే గద్దె రామ్మోహన్ రావు అలాంటి వారు కాదని.. ఆయన విజయాన్ని అడ్డుకునేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కొంతమంది నెటిజనం కామెంట్లు పెడుతున్నారు .గద్దె రామ్మోహన్ గారు 2016 నుంచి తెలుసు. ఆయన ఇలాంటి పనులు చేశారంటే అస్సలు నమ్మమని.. ఇది వందశాతం ఫేక్ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో గద్దె రామ్మోహన్ రావు విజయాన్ని ఆపలేరని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు బరిలో ఉండగా.. వైసీపీ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నారు. ఇరువురి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇలాంటి సమయంలో మరో ఆరురోజుల్లో ఎన్నికల జరగనున్న వేళ ఇలాంటి ఆరోపణలు రావటం సంచలనంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com