ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా కుటుంబంలో చంద్రబాబు నిప్పుపెట్టాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 08:08 PM

మా కుటుంబంలో ఇద్దరు అక్కలు చంద్రబాబు ట్రాప్‌లో పడిపోయారని ఎంపీ వైయ‌స్‌ అవినాష్ రెడ్డి ఆరోపించారు.  బాబు డైరెక్షన్లో వీళ్లు నడుచుకుంటున్నారని ఆయన అన్నారు. దయచేసి ప్రజలు చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డికి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తనకు తోడుగా ఉండాలని ప్రజలను కోరారు. వైయ‌స్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి వైయ‌స్ అవినాష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు భారీ ఎత్తున ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ రోడ్‌ షోలో వైయ‌స్‌ అవినాష్ రెడ్డి వైయ‌స్‌ వివేకా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపైన అనవసరంగా వైయ‌స్ వివేకా హత్య కేసు మోపారని.. నన్ను, మా నాన్నను చాలా ఇబ్బందులకు గురి చేశారని వైయ‌స్‌ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. జైల్లో నాన్నను కలిసినప్పుడల్లా.. తనకు తెలిసి జీవితంలో ఎవరికి ఏ పాపం చేయలేదని.. దేవుడు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు.. ఎందుకు ఇలా జరుగుతోంది అని నాతో అంటూ బాధపడేవాడరని ఆవేదన వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com