మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, అండగా ఉంటానని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. మే 13 న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ముందుగా ఆయా గ్రామాల్లోని పలువురు వైయస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు పలువురు వైయస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ఎమ్మెల్యేను భారీ గజమాలతో ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, వైయస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.