ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుకు తెలిసింది ఓటుకు నోటు పంచడమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 08:05 PM

అధికారంలో ఉన్నన్నాళ్లూ పేదల ఆర్థికపరిస్థితేంటి..? వారి కుటుంబాల జీవనప్రమాణాలేంటనేది చంద్రబాబుకు అవసరంలేని సంగతి అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ‌ముర‌ళీ అన్నారు . అయన మాట్లాడుతూ.... ఆయనకు తెలిసిందల్లా ఐదేళ్లకోసారి ఎన్నికలనగానే పేదలు, కూలీల దగ్గరకు వచ్చి.. వారి ఓటుకు విలువ కట్టడమే. ఓటుకు రూ.వెయ్యి చొప్పున, ఇద్దరికి రూ.2 వేలు, ముగ్గురికి రూ.3వేలు చొప్పున కుటుంబాలకు పంచడమే తెలుసు. మరి, అప్పటిదాకా ఈ పేదవాడి పరిస్థితేంటి..? పూరిగుడిసె, నాగరికత లేదు. డబ్బుల్లేవు. అప్పులు. చుట్టూ పేదరికం, పిల్లలకు విద్యలేదు. తింటానికి తిండిలేదు. కట్టుకోవడానికి బట్ట లేదు. ఇలాంటి వాడికి చంద్రబాబులాంటోడు రూ.వెయ్యి నోటు చూపెట్టి.. ఇదిగో నాకు ఓటేస్తే, ఈ నోటు నీదేనంటూ ఆశపెట్టి.. దశాబ్దాలుగా ఓట్లకు నోట్ల రాజకీయం చేయడమే ఆయనకు తెలుసు అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com