ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లేళ్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు జిల్లెల గణేష్ రెడ్డి మరియు దిద్దెల నాగిరెడ్డిలు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఏరీక్షన్ బాబు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విజయానికి కృషి చేస్తానని వారి అన్నారు. నాయకులు పాల్గొన్నారు.